తెలంగాణ

telangana

ETV Bharat / state

RBI Fine On Mahesh Co Operative Bank : మహేశ్​ కో ఆపరేటివ్​ బ్యాంక్​కు రూ.65 లక్షల ఫైన్.. ఎందుకంటే.. - మహేశ్​ కో ఆపరేటివ్​ బ్యాంక్​కు ఆర్బీఐ ఫైన్

RBI Action On Banks : సైబర్ భద్రత విషయంలో సరైన ప్రమాణాల పాటించని బ్యాంకులపై ఆర్​బీఐ దృష్టి పెట్టింది. సరైన సైబర్ భద్రతా చర్యలు చేపట్టని బ్యాంకులకు జరిమానా విధిస్తోంది. గతేడాది నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు మహేశ్​ బ్యాంకు సర్వర్​ను హ్యాక్ చేసిన ఘటనలో.. ఆర్​బీఐ భారీ జరిమానా విధించింది. మహేశ్​ బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సర్వర్ హ్యాక్ అయినట్లు గుర్తించిన ఆర్​బీఐ.. రూ.65లక్షల జరిమానా విధించింది.

RBI
RBI

By

Published : Jul 1, 2023, 8:56 PM IST

Mahesh Bank Fined Rs 65 Lakh By RBI : ఇళ్లల్లోకి వెళ్లి చోరీలు చేయడం, దారిపోయిన వ్యక్తిని కొట్టి దోపిడీ చేసి డబ్బులు లాక్కెళ్లడం ఒకప్పటి మాట. ఎక్కడో వేరే దేశాల్లో ఉండి నగదును మాయం చేయడం నేటి విధానం. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ ఇక్కడ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నమ్మించి.. ఓటీపీ తెలుసుకొని ఖాతాలో సొమ్ము మాయం చేయడం, లేదా పలు అప్లికేషన్లు డౌన్​లోడ్ చేయించి వాటి సాయంతో ఏకంగా బ్యాంకు ఖాతాలను తమ అధీనంలోకి తీసుకోవడం సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత.

గతేడాది జనవరి 24వ తేదీన సైబర్ నేరగాళ్లు మహేశ్​ కోఆపరేటివ్ బ్యాంకును లక్ష్యంగా చేసుకొని హ్యాకింగ్ చేశారు. అందులో పనిచేసే సిబ్బంది కంప్యూటర్లకు పలుమార్లు ఫిషింగ్ మెయిల్స్​ పంపించారు. సిబ్బంది మెయిల్స్​ ఓపెన్ చేసి చూడగానే బ్యాంకు ప్రధాన సర్వర్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు సర్వర్​లోకి వెళ్లి బ్యాంకు ప్రధాన ఖాతాలో నుంచి రూ.12.48 కోట్లును ఇతర ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ప్రతినిధులు గుర్తించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన మహేశ్​ బ్యాంకు ఖాతాదారులతో పాటు దిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ముంబయి, బెంగళూర్​లలో పలు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వాళ్లను కూడా సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

Mahesh Co Operative Bank Cyber Attacks : మహేశ్​ బ్యాంకు సర్వర్లను పరిశీలించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు లోపాల పుట్టను గుర్తించారు. మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు నిర్లక్ష్యం వల్లే సైబర్ నేరగాళ్లు ప్రధాన సర్వర్ ను హ్యాక్ చేయగలిగారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆర్బీఐకి నివేదిక ఇచ్చారు. హ్యాకింగ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడమే కాకుండా.. ఫిషింగ్ మెయిల్స్​ను గుర్తించే వ్యవస్థ లేకపోవడం, సరైన సమయంలో హెచ్చరికలు చేసే విధానం లేకపోవడం వంటి లోపాలను సైబర్ క్రైం పోలీసులు నివేదికలో పొందుపర్చారు.

మహేశ్​ బ్యాంక్​ లైసెన్స్​ రద్దు చేయాలి : సీపీ సీవీ ఆనంద్ నేరుగా ఆర్​బీఐ గవర్నర్​తో మాట్లాడారు. ఖాతాదారుల డబ్బులను ఫణంగా పెట్టిన మహేశ్​ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని ఆర్​బీఐ గవర్నర్​ను కోరారు. న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆర్​బీఐ అధికారులు లైసెన్సు రద్దు కాకుండా భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు మహేశ్​ బ్యాంకుకు రూ.65లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details