నాటి మధుర జ్ఞాపకాలను అందించే శక్తి ఫొటోగ్రాఫర్స్కు మాత్రమే ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ సాలర్జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ ఆధ్వర్యంలో వర్క్షాప్ను నిర్వహించారు. హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ కార్యక్రమాన్ని హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం - సాలర్జంగ్ మ్యూజియం
భవిష్యత్ తరాలకు మంచి ఫొటోలను అందించాల్సిన భాద్యత నేటితరం ఫొటోగ్రాఫర్లపై ఉందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.
ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం
Last Updated : Aug 20, 2019, 8:07 AM IST