madhu yaski Comments on KCR: రాహుల్ గాంధీ నాయకత్వంపై భాజపా కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తోందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్లో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాజపా గెలవడానికి కేసీఆర్ దోహదపడ్డారని మధుయాష్కీ మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే సర్జికల్ స్ట్రైక్ గురించి కావాలనే సీఎం మాట్లాడారని అన్నారు. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఆర్మీ, మాజీ సైనికులు ఉంటారని... సెంటిమెంట్ రగిలించడం ద్వారా అక్కడ భాజపాను గెలిపించారని మధుయాష్కీ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చప్పుడు చేయకుండా ఉండిపోయారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి, అసదుద్దీన్ ఓవైసీల సహకారంతో భాజపా గెలుపొందిందని పేర్కొన్నారు.