తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 12:25 AM IST

ETV Bharat / state

నామినేషన్లకు సర్వం సిద్ధం : రిటర్నింగ్ ఆఫిసర్ ఝాన్సీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నేటితో ప్రారంభమైంది. నామినేషన్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎల్బీ నగర్, సరూర్​నగర్, హయత్​నగర్ సర్కిళ్ల అధికారులు వెల్లడించారు.

నామినేషన్లకు సర్వం సిద్ధం : రిటర్నింగ్ ఆఫిసర్ ఝాన్సీ
నామినేషన్లకు సర్వం సిద్ధం : రిటర్నింగ్ ఆఫిసర్ ఝాన్సీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థుల నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎల్బీ నగర్, సరూర్​నగర్, హయత్​నగర్ సర్కిళ్ల అధికారులు వివరించారు. నామినేషన్ వేసేందుకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.

బందోబస్త్ ఏర్పాటు చేశాం..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సరూర్​నగర్ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ జరగనుందని తెలిపారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థి సహా ఇద్దరు వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఎన్నికల రిటర్నింగ్ ఆఫిసర్ ఝాన్సీ తెలిపారు.

ఇవీ చూడండి :జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస

ABOUT THE AUTHOR

...view details