నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి ఫణీంద్ర, తేజశ్రీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ అగ్రకులానికి చెందిన వారే. అంతేకాక యువకుడు వృత్తిరీత్యా విదేశాల్లో స్థిరపడగా... యువతి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తోంది. కానీ వారి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. చేసేది లేక చివరకు ఆర్య సమాజంలో కొంతమంది సన్నిహితులు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. స్నేహితుల సాయంతో ఒక్కటయ్యారు - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగ రిత్యా బాగా స్థిరపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారు అంగీకరించలేదు. చేసేది లేక వివాహం చేసుకున్నారు.

ప్రేమ.. పెళ్లి.. పోలీసులనాశ్రయించిన కొత్తజంట
అనంతరం తమ రక్షణ కోసం కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు.
ఇదీ చదవండి:కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి