తెలంగాణ

telangana

Lockdown: ఉల్లంఘిస్తే కేసులే.. ఈ పాస్​లు ఉంటేనే అనుమతి

By

Published : May 29, 2021, 8:41 AM IST

హైదరాబాద్​, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో లాక్​డౌన్​ పటిష్ఠంగా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్​ చేస్తున్నారు.

lockdown in hyderabad, cyberabad commissionerate
హైదరాబాద్​, సైబరాబాద్​ కమిషనరేట్లలో లాక్​డౌన్​

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు జప్తు చేస్తున్నారు. శుక్రవారం.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నిబంధనలు పాటించని వారిపై 9,552 కేసులు నమోదు చేశారు. 6,514 వాహనాలను సీజ్​ చేశారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిబంధనలు అతిక్రమించిన 886 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ పాస్‌లు ఉన్న వారు మాత్రమే లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో రోడ్లపై రాకపోకలు కొనసాగించాలని.. మిగిలిన వారు రోడ్డెక్కితే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో

ABOUT THE AUTHOR

...view details