Lock to Village Secretariat: బిల్లులు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఓ గుత్తేదారు గ్రామ సచివాలయానికి తాళం వేశాడు. ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామానికి చెందిన గుత్తేదారు బాలకోటిరెడ్డి ఏడాది క్రితం పంచాయతీ రాజ్కు సంబంధించిన రూ.9లక్షల కాంట్రాక్ట్ పనులను పూర్తిచేసి అప్పగించారు.
అయితే ఏడాదిగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. అధికారుల తీరుతో విసిగిపోయిన గుత్తేదారు.. ఇండ్లచెరువు గ్రామ సచివాలయానికి తాళం వేశారు. అక్కడే బైఠాయించి నిరనస తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఎంపీడీవోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పటంతో.. గుత్తేదారు సచివాలయం తాళం తీశారు.