తెలంగాణ

telangana

కరోనా భయంతో వృద్ధ దంపతులను గెంటేసిన స్థానికులు

By

Published : Mar 18, 2020, 12:25 AM IST

Updated : Mar 18, 2020, 7:29 AM IST

సికింద్రాబాద్ అల్వాల్​లో కరోనా భయంతో విదేశం నుంచి వచ్చిన ఓ వృద్ధ దంపతులను స్థానికులు కాలనీ నుంచి వెళ్లగొట్టారు. అనంతరం చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వారికి వ్యాధి లక్షణాలు లేవని గుర్తించారు. క్వారంటైన్​కు పంపించాలని అపార్ట్ మెంట్ వాసులు సూచిస్తున్నారు.

విదేశం నుంచి వచ్చారని వెల్లగొట్టిన స్థానికులు
విదేశం నుంచి వచ్చారని వెల్లగొట్టిన స్థానికులు

కరోనా భయం వృద్ధ దంపతులను రోడ్డున పడేసింది. విదేశాల నుంచి వచ్చారనే కారణంతో కనీస కనికరం కూడా లేకుండా నిర్ధాక్షణ్యంగా రోడ్డు మీదకు నెట్టేశారు అపార్ట్​మెంట్​ వాసులు. సికింద్రాబాద్​ అల్వాల్​ జరిగింది ఈ సంఘటన

సికింద్రాబాద్ అల్వాల్​లో కరోనా భయంతో అపార్ట్​మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. అల్వాల్​లోని చాణక్య షెల్టర్ అపార్ట్ మెంట్​ వాసులు.. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వృద్ధ దంపతులను బయటకు వెళ్ళగొట్టారు. కరోనా వైరస్ అపార్ట్ మెంట్ వాసులకు సోకుతుందన్న అనుమానంతో వృద్ధ దంపతులను బయటకు గెంటేశారు.

విదేశం నుంచి వచ్చారని...

వృద్ధ దంపతులు విదేశం నుంచి వచ్చినప్పటికీ వారికి కరోనా లక్షణాలు లేవు. అయినప్పటికీ భయాందోళనతో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తన భార్య లక్ష్మీతో సహా అతను అమెరికా నుంచి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. వారికి కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో క్వారంటైన్​కు పంపించాలని స్థానికులు కోరుతున్నారు.

విదేశం నుంచి వచ్చారని వెల్లగొట్టిన స్థానికులు

ఇవీ చూడండి : తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల

Last Updated : Mar 18, 2020, 7:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details