తెలంగాణ

telangana

ETV Bharat / state

'లంచం ఇవ్వాలి... భిక్షం వేయండి'

రెవెన్యూ సిబ్భందికి లంచం ఇవ్వాలని ఓ మహిళ వినూత్న నిరసన చేసింది. కష్ట పడి కట్టుకున్న ఇంటిని కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

By

Published : Feb 4, 2019, 2:57 PM IST

'లంచం ఇవ్వాలి... భిక్షం వేయండి'

lncn-ivvaali-dot-dot-dot-bhikssn-veeynddi
కడప కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన యమున అనే మహిళ వినూత్నంగా నిరసన చేశారు. రెవిన్యూ అధికారులకు లంచం ఇచ్చేందుకు డబ్బులు వేయండంటూ భిక్షాటనకు దిగారు. 12 ఏళ్ల క్రితం సొంత ఊరు నుంచి వచ్చి ఇప్పుడు కష్టపడి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. పది వేల రూపాయలు లంచం ఇవ్వలేదనే కారణంతో అధికారులు తన ఇల్లు కూల్చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడబెట్టి ఐదు లక్షల డబ్భై ఐదు వేల రూపాయలతో కట్టుకున్న ఇంటిని పడగొట్టారన్నారు. ఇలాంటి అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details