తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 9:15 PM IST

ETV Bharat / state

'జర్నలిస్టులకు బీమా కోసం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు లేఖ'

జర్నలిస్టులకు బీమా సదుపాయం వర్తింపజేయాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్. విధి నిర్వహణలో మరణించిన పాత్రికేయ కుటుంబాలకు సాయమందించాలని ప్రభుత్వాన్ని కోరింది.

'జర్నలిస్టులకు బీమా కోసం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు లేఖ'
'జర్నలిస్టులకు బీమా కోసం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు లేఖ'

వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్నట్లే జర్నలిస్టులకూ బీమా సదుపాయం వర్తింపజేయాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​ను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోరింది. విధుల్లో భాగంగా రాష్ట్రంలో ఓ జర్నలిస్టు ఆదివారం మృతి చెందిన నేపథ్యంలో పాత్రికేయులకు సంబంధించి సూచనలు చేస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లేఖ రాసింది.

విధులు నిర్వహిస్తోన్న పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించేలా ఆధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. దివంగత పాత్రికేయుడిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని క్లబ్ పేర్కొంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్​కి విన్నవించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

'జర్నలిస్టులకు బీమా కోసం ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు లేఖ'

ఇవీ చూడండి : 'విద్యుత్ బిల్లులు ఎక్కువేం రాలేదు.. వినియోగమే పెరిగింది'

ABOUT THE AUTHOR

...view details