తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 7:32 AM IST

Updated : Jun 9, 2020, 11:09 AM IST

ETV Bharat / state

ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

హైదరాబాద్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

chirutha
chirutha

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంటి కిటికీ ఎక్కి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

చిరుత సంచారంతో స్థానికులు, వర్సిటీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చిరుతను వెంటనే బంధించాలని కోరుతున్నారు.

Last Updated : Jun 9, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details