తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​కు లక్ష్మణ్, కోదండరాం నివాళులు - ట్యాంక్ బండ్​పై అంబేడ్కర్ విగ్రహనికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,

డిసెంబర్​ 6న అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లో ఆయనకు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్​పై అంబేడ్కర్ విగ్రహనికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పూలమాల వేసి సంతాపం ప్రకటించారు.

Laxman and Kodandaram pray tribute to Ambedkar
అంబేద్కర్ కు లక్ష్మణ్, కోదండరాం నివాళులు

By

Published : Dec 6, 2019, 9:21 PM IST

అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్​పై అంబేడ్కర్ విగ్రహనికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కాలపరిమితి ముగిసే సమయాన్ని పొడిగించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి విషయంలో సీఎం కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని లక్ష్మణ్ కోరారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశానికి మంచి రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అందించారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ అన్నారు. రాజకీయ విప్లవానికి పునాదులు వేయడమే కాకుండా, సమాజంలో అసమానతలు రూపుమాపారని అన్నారు. మనుషుల మధ్య సమానత్వానికి కృషి చేశారని పేర్కొన్నారు. దీని కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని కోదండరాం తెలిపారు.

అంబేద్కర్ కు లక్ష్మణ్, కోదండరాం నివాళులు

ఇదీ చూడండి : ఆర్టీసీలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

ABOUT THE AUTHOR

...view details