డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాఫీ చేస్తానంటూ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. చందానగర్ ప్రాంతానికి చెందిన వెంకటపవన్ కుమార్ గత నెల 16న మద్యం తాగి గచ్చిబౌలి ప్రాంతంలో వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పవన్కుమార్కు జైలు శిక్ష విధించింది. దీని నుంచి తప్పించుకునేందుకు స్థానిక న్యాయవాది భానుప్రసాద్ను సంప్రదించాడు. అతను కేసు మాఫీ చేయడమే కాకుండా... వాహనాన్ని విడిపిస్తానని చెప్పి రూ.70 వేలు డిమాండ్ చేశాడు. రూ.40 వేల విలువైన ఒక ఆపిల్ వాచ్, పదివేల నగదు ముందుగా ఇచ్చాడు. తరువాత న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన లేదు. గత నెల 29 నుంచి మూడు రోజులు పాటు పవన్ జైలు శిక్ష అనుభవించాడు. మోసపోయానని గ్రహించిన అతను న్యాయవాది భానుప్రసాద్పై కేపీహెచ్బీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కేసు మాఫీ చేస్తానని మోసం చేసిన న్యాయవాది అరెస్టు - kukatpally crime
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాఫీ చేస్తానని ఓ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చందానగర్కు చెందిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుణ్ని కటాకటాల్లోకి నెట్టారు.
![కేసు మాఫీ చేస్తానని మోసం చేసిన న్యాయవాది అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4390120-thumbnail-3x2-lawgupta.jpg)
మోసం చేసిన న్యాయవాది అరెస్టు