తెలంగాణ

telangana

ETV Bharat / state

లేడీ కిడ్నాపర్

ప్రేమించాలంటూ వేధిస్తున్న యువకుడిని ఓ యువతి కిడ్నాప్ చేయించింది. అతనిని కొట్టించింది. చివరకు జైలుపాలైంది.

By

Published : Feb 2, 2019, 1:19 PM IST

lady

lady
ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పాలనుకుంది. చేసేది సాఫ్ట్​వేర్ ఉద్యోగమైన సాఫ్ట్​గా ఆలోచించలేదు. పక్కా ప్లాన్ వేసి స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించింది. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు కటకటలా పాలైంది.
సికింద్రాబాద్ మల్కాజ్​గిరికి చెందిన దివ్య ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ప్రోగ్రామింగ్​ మేనేజర్​గా పనిచేస్తోంది. కొంతకాలంగా బోరబండకు చెందిన సాయి అనే కార్పెంటర్ ప్రేమిస్తున్నానంటూ రోజు ఫోన్లో వేధించేవాడు. ఎవరికి చెప్పకుండా సమస్యను తానే పరిష్కారించుకోవాలనుకుంది.
గురువారం దివ్య సాయికుమార్‌కు ఫోన్‌ చేసి సెయింట్‌ మేరీస్‌ కళాశాల వద్దకు రమ్మని చెప్పింది. అక్కడే ఉన్న స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించింది. మల్కాజ్​గిరి, మీర్జాలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లి కొట్టించింది. తప్పించుకున్న బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరించి అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ముందుగా దివ్యను కిడ్నాప్‌ చేసినట్లుగా భావించిన స్థానికులు, 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, బాధితుడు ఆసుపత్రికి రావడంతో కేసు మిస్టరీ వీడిందని ఏసీపీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details