సాంకేతిక యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కె.వి. రమణాచారి పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పూజారి లేకపోయినా.. అన్ని పూజా కార్యక్రమాలు శాస్త్రీయంగా నిర్వహించేలా రూపొందించిన బ్రహ్మాస్మి వైబ్సైట్నుహైదరాబాద్లో ఆయన ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులను గుర్తించి.. వారి సంక్షేమం కోసం పరిషత్ ఏర్పాటు చేశారని రమణాచారి పేర్కొన్నారు. రూ.100 కోట్లు కేటాయించి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ హిందూ మత పూజా కార్యక్రమాలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆధునిక వేద పండితుల సమూహాల సమ్మేళనమే బ్రహ్మాస్మి అని వక్తలు అభిప్రాయపడ్డారు.