కూకట్పల్లి డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు డివిజన్ల కార్పోరేటర్లతో కలిసి పాల్గొన్నారు. కేపీహెచ్పీ కాలనీలో రూ. ఐదు లక్షల వ్యయంతో చేపట్టిన చిన్న పిల్లల ఆట పరికరాలను ప్రారంభించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులను, వసంత నగర్లోని పార్క్ను పరిశీలించారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వాలి' - హైదరాబాద్ తాజా వార్తలు
తెరాస హయాంలోనే కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్బీ కాలనీ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి అత్యధిక మెజరీటీ ఇవ్వాలి'
అనంతరం కీపీహెచ్బీ డివిజన్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్బీ కాలనీ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.