హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లింక్ రోడ్డు నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి, హైదర్నగర్ నుంచి ఔటర్రింగ్ రోడ్డు వరకు నిర్మాణంలో ఉన్న లింక్రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
లింక్ రోడ్డు నిర్మాణానికి స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంలో మిగతా చోట్ల చేపట్టిన రోడ్లు, వంతెన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
'హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లింక్రోడ్ల నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. వీటికోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వేగంగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న లింక్రోడ్లన్నీ అందుబాటులోకి వస్తే కూకట్పల్లిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజలందరూ సహకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న బాలనగర్ వంతెనను కూడా జూలైలోగా అందుబాటులోకి తీసుకొస్తాం. హైదరాబాద్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రోడ్లన్నీ ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంలో దేశానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలుస్తోంది. '-ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
లింక్రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు ఇవీ చూడండి:బ్లాక్ పాంథర్ కాదది.... మానుపిల్లే... !!