తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్యాంకు ఉద్యోగిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్' - KUKATPALLY ACCUSED SHIFTED TO CHARLAPALLI JAIL

హైదరాబాద్​ కూకట్​ పల్లిలో ఇటీవల బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు

By

Published : Nov 16, 2019, 11:33 AM IST

కూకట్ పల్లి మైత్రి నగర్​లో మంగళవారం రాత్రి బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడిలో తెరాస నేతతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వచ్చిన కస్తూరి రాజేష్​ను అడ్డగించిన నిమ్మల సంతోష్ రావు, అతని అనుచరులు...తమ వాహనాలను అడ్డంగా పెట్టారు. వాహనాలు తొలగించమన్నందుకు రాజేష్, సహా వాచ్​మెన్ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేష్ కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితులు... చర్లపల్లి జైలుకు తరలింపు
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిమ్మల సంతోష్​తో పాటు అతని అనుచరులు మహేష్ కుమార్, నవీన్ కుమార్, యాదగిరి, చక్రధర్, పరుచూరి క్రాంతి కిరణ్​లను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. కూకట్​ పల్లి న్యాయమూర్తి శ్రీదేవి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడం వల్ల పోలీసులు చర్లపల్లి కారాగారానికి తరలించారు.

నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
ఇవీ చూడండి : కత్తులతో యువకుడి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details