తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న కేటీఆర్ - Hyderabad development program news

హైదరాబాద్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కొత్త నిర్మించిన లింక్‌రోడ్‌లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించనున్న లింక్‌రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న కేటీఆర్
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న కేటీఆర్

By

Published : Nov 9, 2020, 5:22 AM IST

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... ఇవాళ హైదరాబాద్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నగరంలో కొత్త నిర్మించిన లింక్‌రోడ్లతో పాటు మరిన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్మించనున్న లింక్‌రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నందిహిల్స్‌లో రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఓల్డ్‌ ముంబయి రోడ్‌, రూ. 15.54 కోట్లతో నిర్మించిన లెదర్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం రూ. 23.10 కోట్ల వ్యయంతో లెదర్‌ పార్క్‌ సమీపంలో నిర్మించనున్న వీయూపీ బ్రిడ్జ్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓల్డ్‌ ముంబయి నుంచి ఈఎస్‌సీఐ టూ డీపీసీ ఖాజగూడ వద్ద రూ. 19.51 కోట్లతో నిర్మించిన లింక్‌రోడ్‌ను ప్రారంభించి అటు నుంచి రూ. 7.75 కోట్లతో మియాపూర్‌, నిజాంపేట్‌ లింక్‌ రోడ్‌ను ఆయన ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:వైద్యుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు: ఈటల

ABOUT THE AUTHOR

...view details