తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ సప్లి ఫలితాలపై... కేటీఆర్​ ట్వీట్​

తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్​ఐటీలు, ట్రిపుల్​ఐటీలు సీట్లు ఇచ్చాయని, అయితే ఇప్పటి వరకు ఇంటర్ ఫలితాలు రాకపోవడం వల్ల సీట్లు కోల్పోతారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్​కు ట్విట్టర్​ ద్వారా విన్నవించారు. స్పందించిన ఆయన ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

By

Published : Jul 13, 2019, 5:44 AM IST

Updated : Jul 13, 2019, 7:14 AM IST

ఇంటర్ సప్లి ఫలితాలపై...కేటీఆర్​ ట్విట్​

ఇంటర్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి. ఈ విషయాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ శుక్రవారం రాత్రి ట్విట్టర్​లో వెల్లడించారు. జులై 15 లోపు ఇంటర్ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్​ఐటీలు, ట్రిపుల్​ఐటీలు సీట్లు వచ్చినా.. ఇప్పటి వరకు ఇంటర్ ఫలితాలు రాకపోవడం వల్ల విద్యార్థులు సీట్లు కోల్పోతారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్​కు ట్విట్టర్​​ ద్వారా విన్నవించారు. స్పందించిన కేటీఆర్​ ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికి ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్​ ట్వీట్​ చేశారు. ఫలితాలను మొదట శనివారం ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలతో జేఎన్​టీయూహెచ్ నిపుణుల పర్యవేక్షణలో తనిఖీ చేయిస్తున్నారు.

ఇంటర్ సప్లి ఫలితాలపై... కేటీఆర్​ ట్వీట్​
Last Updated : Jul 13, 2019, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details