మిషన్ భగీరథ అమలుతో రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవని.. మిషన్ భగీరథను విజయవంతంగా అమలుచేయడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య సున్నాకు చేరుకుందని ఆయన తెలిపారు.
'రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు' - మిషన్ భగీరథ వల్ల సున్నాకు చేరుకున్న ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు
తెలంగాణలో మిషన్ భగీరథ అమలు వల్ల ప్రస్తుతం ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు సున్నాకు చేరుకున్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు.
!['రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు' central government approved that telangana has zero fluoride effected villages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843632-803-8843632-1600405262572.jpg)
మిషన్ భగీరథ వల్ల సున్నాకు చేరుకున్న ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు
కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేకుండా కృషి చేసిన మిషన్ భగీరథ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండిఃకరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు
Last Updated : Sep 18, 2020, 10:49 AM IST