తెలంగాణ

telangana

ETV Bharat / state

దోమలగూడలో పంచతత్వ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్​

హైదరాబాద్​ నగరవాసుల సౌకర్యార్థం జీహెచ్​ఎంసీ అనేక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి దోమలగూడలోని పంచతత్వ పార్కు అందుబాటులోకి రానుంది. ఈ పార్కును ఈ రోజు కేటీఆర్​ ప్రారంభించనున్నారు. ఎకరం విస్తీర్ణంలో వివిధ హంగులతో పార్కును అభివృద్ధి చేశారు. ఆక్యుప్రెజర్​ పద్ధతిలో వాకింగ్​ చేసేటప్పుడు పాదాలకు ఒత్తిడి కలిగించేలా వాకింగ్​ ట్రాక్​ని అమర్చడం ఈ పార్కు ప్రత్యేకత!!

By

Published : Nov 15, 2020, 10:03 AM IST

ktr inaugurated panchathathva park
దోమలగూడలో పంచతత్వ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్​

హైదరాబాద్​ దోమలగూడలో పంచతత్వ పార్కును మంత్రి కేటీఆర్​ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెజర్​ వాకింగ్​ ట్రాక్​ ఈ పార్కు ప్రత్యేకత. ఈ పద్ధతిలో 8 అంశాలతో పార్కును సిద్ధం చేశారు. సర్కిల్​ పద్ధతిలో ఉన్న ఈ ట్రాక్​పై నడుస్తున్నప్పుడు పాదాల్లోని నరాలపై ఒత్తిడి కలిగించేలా వాకింగ్​ ట్రాక్​ ఏర్పాటు చేశారు. 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివ‌ర్ స్టోన్స్‌, 6 ఎం.ఎం చిప్స్‌, ఇసుక‌, చెట్ల బెర‌డు, న‌ల్ల‌రేగ‌డి మ‌ట్టి, నీటి బ్లాక్‌ల‌ను విడివిడిగా అనుసంధానం చేస్తూ ట్రాక్‌ను నిర్మించారు.

ఆరోగ్యంపై సానుకూల ప్రభావం

ట్రాక్​పై మొద‌ట‌ న‌రాల‌పై అధిక ఒత్తిడి క‌లిగించి క్రమంగా ఒత్తిడి త‌గ్గించే ట్రాక్ వైపు న‌డ‌వ‌టం వ‌ల్ల ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ‌లో సానుకూల మార్పు జ‌రిగి వివిధ ర‌కాల అనారోగ్యాలు దూర‌మ‌వుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పార్కు మ‌ధ్య‌లో గౌత‌మ బుద్ధుడి విగ్ర‌హాన్ని నెల‌కొల్పారు. ఈ స‌ర్కిల్‌కు అన్ని వైపులా 40 ర‌కాల మెడిసిన‌ల్, హెర్బ‌ల్‌ మొక్కలని పెంచారు.

ఇదీ చదవండి:ప్రయాణికులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా

ABOUT THE AUTHOR

...view details