హైదరాబాద్లోని ప్రగతి భవన్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే రాకతో కొత్తశోభను సంతరించుకుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు పలువురు అభినందనలు తెలిపారు. పార్టీకార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడాది పాలనపై ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్కు శుభాకాంక్షల వెల్లువ...
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన్ను అభినందించారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న కేటీఆర్