తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2021, 2:38 PM IST

Updated : Dec 6, 2021, 3:13 PM IST

ETV Bharat / state

KRMB Meeting: నీటి విడుదలపై ఈనెల 9న కేఆర్​ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

KRMB three member committee Meeting: తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుత ఏడాదిలో కృష్ణా జలాల విడుదలపై ఈనెల 9న ఈ భేటీ జరగనుంది. 2021-22లో రెండు రాష్ట్రాల అవసరాలపై సమావేశంలో చర్చించనున్నారు.

KRMB Meeting
KRMB Meeting

KRMB three member committee Meeting: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రస్తుత ఏడాదిలో కృష్ణా జలాల విడుదలకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ... ఈనెల 9న సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆన్‌లైన్‌లో సమావేశం కానున్నారు.

KRMB meeting on water release: ప్రస్తుత నీటి సంవత్సరం 2021-22లో రెండు రాష్ట్రాల అవసరాలు, అందుకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటి విడుదలపై చర్చించి ఆదేశాలు జారీ చేయనున్నారు.

Krishna Board on water: కృష్ణా నదికి ఈ ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో ఇరు రాష్ట్రాలు అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి... ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలు చెప్పాలని ఇటీవల రాష్ట్రాల ఈఎన్‌సీలను బోర్డు కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా మిగిలిన వాటా జలాలను కమిటీ కేటాయించనుంది.

ఇవీ చూడండి:

KRMB letter to Telangana, Andhra Pradesh: ఇప్పటికే కేఆర్​ఎంబీ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాసింది. సాగు, తాగు అవసరాలకు లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో విద్యుదుత్పత్తి చేశారని లేఖలో తెలిపింది. విద్యుదుత్పత్తి వల్ల 56 టీఎంసీల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయని కేఆర్​ఎంబీ వెల్లడించింది. రెండు రాష్ట్రాలు నీటి వాడకం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 95 టీఎంసీలకు పడిపోయిందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల కార్యదర్శులకు రాసిన లేఖలో బోర్డు పేర్కొంది. తక్షణమే విద్యుదుత్పత్తి ఆపాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 6, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details