తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆచార్య కొండ లక్ష్మణ్​ బాపూజీ 105వ జయంతి వేడుకలు - latest news of laxman bapuji birth anniversary celebrations in hyderabad

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​లో ఆచార్య కొండ లక్ష్మణ్​ బాపూజీ 105వ జయంతి వేడుకలను భాజపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఇల్లును కూడా కార్యాలయంగా మార్చి ప్రజలకోసం నిర్విరామ కృషిచేసిన ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.

konda laxman bapuji 105th birth anniversary celebrations in hyderabad
ఆచార్య కొండ లక్ష్మణ్​ బాపూజీ 105వ జయంతి వేడుకలు

By

Published : Sep 27, 2020, 5:25 PM IST

కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్ గుడిమల్కాపూర్​లోని రాజలింగయ్య కబడ్డీ స్టేడియం వద్ద ఆయన చిత్రపటానికి నాంపల్లి భాజపా ఇన్​ఛార్జ్​ దేవర కరుణాకర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాటం చేసిన మహానేతని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

తన సొంత ఇల్లును కార్యాలయం కోసం దానం చేశారని.. ఆయనో గొప్ప గాంధేయవాది అని, బీద బడుగు బలహీన వర్గాల నేతని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశోక్​యాదవ్​, అన్ను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొండా లక్ష్మణ్​ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details