తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2020, 3:20 PM IST

ETV Bharat / state

ప్రశాంత్​ భూషణ్​కు సంఘీభావంగా కోదండరాం దీక్ష

సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సంఘీభావంగా తెజస అధ్యక్షుడు కోదండరాం దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగిన కోదండరాం... ప్రశాంత్‌ భూషణ్‌ను సుప్రీంకోర్టు క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.

kodandaram protest Solidarity with prashanth bhushan
kodandaram protest Solidarity with prashanth bhushan

న్యాయస్థానాన్ని కించే పరిచే ఉద్దేశంతో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలు చేయలేదని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. పనివిధానం మెరుగుపడి... ప్రజలకు కోర్టుల పట్ల గౌరవభావాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఉండాలని పేర్కొన్నారన్నారు. ప్రశాంత్‌ భూషణ్‌కు సంఘీభావం తెలియజేస్తూ.. తెజస అధ్యక్షుడు కోదండరాం పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ప్రశాంత్‌ భూషణ్‌ను సుప్రీంకోర్టు క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ABOUT THE AUTHOR

...view details