తెలంగాణ

telangana

సంక్రాంతి వేళ చిన్నారులకు పతంగుల పంపిణీ

By

Published : Jan 13, 2021, 6:17 PM IST

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తెదేపా మల్కాజ్​గిరి పార్లమెంట్​ ప్రధాన కార్యదర్శి చిన్నారులకు పతంగులని పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ...కరోనా మహమ్మారి అంతం కావాలని ఆకాంక్షించారు.

kites distribution to children in bowenpally
చిన్నారులకు పతంగులని పంపిణీ

హైదరాబాద్​లోని బోయిన్​పల్లి పార్టీ కార్యాలయం వద్ద తెదేపా మల్కాజ్​గిరి పార్లమెంట్​ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్ చిన్నారులకు పతంగులను అందజేశారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ... సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి అంతం కావాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు పతంగులు ఎగరవేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:కరోనా​.. ఇక సాధారణ జలుబు కారకమే!

ABOUT THE AUTHOR

...view details