తెలంగాణ

telangana

దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్​రెడ్డి

By

Published : Oct 30, 2020, 2:48 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి భాజపా అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి భూంపల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికలో తెరాసను ఓడించి తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలకాలని ఆయన వ్యాఖ్యానించారు.

Kishanreddy election compaign in dubbaka central minister kishanreddy
దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్​రెడ్డి

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలతో తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలకాలన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో భాజపా జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని భూంపల్లి చౌరస్తాలో రఘునందన్​రావుతో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే తెరాసకు వేసినట్లే విమర్శించారు. ఎంఐఎం పెంచి పోషిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి భాజపా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.

ఇదీ చూడండి:దుబ్బాకలో తారస్థాయికి చేరుకున్న ఉపఎన్నిక పోరు

ABOUT THE AUTHOR

...view details