ఖైరతాబాద్ డివిజన్ తెరాస అభ్యర్థి, దివంగత పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద గణేశ్ వద్ద నుంచి ర్యాలీగా వచ్చిన ఆమె.. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామపత్రం సమర్పించారు. మరోసారి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఖైరతాబాద్ డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని విజయ రెడ్డి హామీ ఇచ్చారు.
ఖైరతాబాద్ డివిజన్ తెరాస అభ్యర్థి నామపత్రం దాఖలు - తెరాస అభ్యర్థి విజయ రెడ్డి నామినేషన్ దాఖలు హైదరాబాద్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వివిధ డివిజన్లకు పార్టీల అభ్యర్థులు ర్యాలీలుగా వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. ఖైరతాబాద్ డివిజన్ తెరాస అభ్యర్థిగా.. దివంగత పీజే ఆర్ కుమార్తె విజయ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామపత్రం సమర్పించారు.
ఖైరతాబాద్ డివిజన్ తెరాస అభ్యర్థి నామపత్రం దాఖలు