తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరగనున్న కిరోసిన్​ ధరలు

కిరోసిన్​ వినియోగదారులపై తాజాగా 25పైసలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. రాబోయే నెలల్లో ఈ ధరలు ఇంకా పెరగనున్నట్లు సమాచారం.

By

Published : Mar 15, 2019, 7:12 AM IST

Updated : Mar 15, 2019, 9:59 AM IST

కిరోసిన్​ ధరలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ

కిరోసిన్​ ధరలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో వినియోగదారులపై స్వల్పంగా కిరోసిన్ ధరల భారం పడింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న కిరోసిన్‌పై లీటరుకు 25 పైసలు ధర అదనంగాపెరిగింది. ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో డిసెంబరు వరకు ఈ ధరల్లో పెను మార్పులు రానున్నట్లు సమాచారం.

ఇంకా పెరగనున్న కిరోసిన్​ ధరలు

చౌక ధరల దుకాణాల డీలర్లు, టోకు వర్తకుల కమీషన్ పెంచుతూ తాజాగా పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా లీటరు ధర 29.75 రూపాయలు, రిటైలర్​కైతే 25 పైసల కమీషన్​తో మొత్తం కలిపి 30 రూపాయలు చొప్పున ధర ఉండనుంది. మే నుంచి జూన్‌ వరకు లీటరు ధర 31 రూపాయలుగా ఉండనున్నాయి. ఇక జూలై నుంచి ఆగస్టు వరకు 32 రూపాయలు, సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు 33, నవంబరు, డిసెంబరులలో 34 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి. కమీషన్‌ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. 2014లో లీటరు కిరోసిన్ ధర 18 రూపాయలు ఉండేది. ఏటేటా చమురు ధరలు పెరగడం సర్వ సాధారణమేనని పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి: తలసానిని కలిసిన మా సభ్యులు

Last Updated : Mar 15, 2019, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details