తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం..సడలింపులపై ఉత్కంఠ - KCR review today on corona conditions and lockdown easing

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్​తో పాటు సడలింపులపై సీఎం కేసీఆర్ నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. 29వరకు ఆంక్షలను పొడిగించిన ప్రభుత్వం సడలింపుల విషయంలో ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో... సర్కార్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సహా ఇతర సేవలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

KCR review today on corona conditions and lockdown easing in hyderabad
కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ సడలింపులపై నేడు కేసీఆర్‌ సమీక్ష

By

Published : May 15, 2020, 7:17 AM IST

Updated : May 15, 2020, 7:34 AM IST

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో... ఈనెల 29 వరకు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం.. సడలింపులు సహా సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యంతర సమీక్ష చేపట్టనుంది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరిస్థితులపై సీఎం సమీక్షిస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో కొత్త కేసులు రానప్పటికీ జీహెచ్​ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, నియంత్రణా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇతర అంశాలపై సీఎం సమీక్షిస్తారు.

సమీక్షపై ఉత్కంఠ

రాష్ట్రంలో ఈనెల 29వరకు లాక్‌డౌన్ పొడగించినా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. గ్రీన్ జోన్లలో సగం సామర్థ్యంతో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతినిచ్చినా.... రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. మరికొన్ని సడలింపులు సైతం ఇవ్వలేదు. నిబంధనలు తొలగించినప్పటి నుంచి ఇప్పటివరకు... ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపైనా సమీక్షలో సీఎం కేసీఆర్‌ చర్చిస్తారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో పరిస్థితులపై పూర్తిస్థాయిలో సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను ఇప్పటికే 29వరకు పొడిగించినందున ఆవిషయమై సర్కార్ యధాతథ స్థితిని కొనసాగించనుంది.

రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నందున అనుసరించాల్సిన కార్యాచరణపైనా సమావేశంలో చర్చించి ప్రణాళిక ఖరారు చేస్తారు. నగరంలో ఆంక్షలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిర్వహణ సహా ఇతర సేవలకు అనుమతులపై ఇవాళ్టి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్​ఓ 'యాప్​' సాయం

Last Updated : May 15, 2020, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details