తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2019, 6:39 PM IST

ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్

పాలనలో నూతన సంస్కరణలు, కొత్త మున్సిపల్​, రెవెన్యూ చట్టాలు వంటి అంశాలపై సీఎం కేసీఆర్​ గవర్నర్​ను కలిసి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలను సీఎం గవర్నర్​కు వివరించారు.

సీఎం కేసీఆర్​

రాజ్ భవన్​లో గవర్నర్ నరసింహన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్​కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.

గవర్నర్​తో భేటీ అయిన కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details