ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లను కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్ హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అపాయింట్మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరింది. వీలైతే ప్రధానమంత్రి, జల్శక్తి మంత్రులను శుక్రవారమే కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ షాను కలుస్తారని తెలిసింది. ముగ్గురిని కలిసిన అనంతరం ఆదివారం ముఖ్యమంత్రి దిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమవుతారని పార్టీ వర్గాల సమాచారం.
నిపుణులతో కేసీఆర్ భేటీ