తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు లేఖ రాసిన కర్ణాటక సీఎం

కృష్ణ నుంచి దిగువకు విడుదల చేసే నీటిపై జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు కర్ణాటక సీఎం యడియూరప్ప లేఖ రాశారు.

By

Published : Aug 5, 2019, 7:51 PM IST

కేసీఆర్​కు లేఖ రాసిన కర్ణాటక సీఎం

"కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని కోయానా, ఇతర జలాశయాల నుంచి కృష్ణానదికి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో వరద నీటిని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్​ జలాశయాలకు వదులుతోంది. ఆ రెండు జలాశయాల్లో నీటిమట్టం నిండిపోగా మిగులు ప్రవాహం లభిస్తోంది. అందుకే వాటిని కృష్ణ నదిలోకి వదులుతున్నాము. ప్రజలు, పంటలు, జలాశయం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఉదయం నారాయణపూర్​ రిజర్వాయర్​ నుంచి 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని కృష్ణలోకి విడుదల చేశాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, కృష్ణ బేసిన్​కు సంబంధించిన జిల్లా పరిపాలన, ఆనకట్ట అధికారులకు తగిన జాగ్రత్త చర్యలను నిర్దేశించాలని కోరుతున్నాను."
- లేఖలో యడియూరప్ప

కేసీఆర్​కు లేఖ రాసిన కర్ణాటక సీఎం

ABOUT THE AUTHOR

...view details