తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2022, 12:03 PM IST

ETV Bharat / state

కందుకూరు ఘటన.. పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

Kandukuru Incident Police: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర పోలీసుల తీరుపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. ఆ తర్వాత రోజు ఆ రాష్ట్రం సీఎం రాకతో ఒక్క రోజులోనే వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Kandukuru Incident Police
Kandukuru Incident Police

ఆంధ్రప్రదేశ్​తో పాటు దేశంలో ఎంతో విషాదం నింపిన నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇందులో పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ రాష్ట్ర సీఎం ప్రభుత్వేతర కార్యక్రమాలకు వచ్చినా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. చంద్రబాబు పర్యటనపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ నెల 20న ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు ముఖ్యమంత్రి హాజరవగా.. సుమారు 11 వందల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేశ్​ తల్లి మృతి చెందారు. ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి రాగా ఒక్క రోజులోనే వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కందుకూరు ఘటన.. పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details