తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2022, 7:08 PM IST

ETV Bharat / state

జగన్​కు 25 ఎంపీలు ఇస్తే, మోదీకి మసాజ్ చేస్తున్నారు: కేఏ పాల్

KA Paul letter to Ambedkar statue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం సమర్పించారు. జగన్​కి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

KA Paul letter to Ambedkar statue
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

KA Paul letter to Ambedkar statue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని వాపోయారు. పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పోతున్నారని... లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు జగన్​కు ఓటు వేస్తే "బుద్ధి వచ్చింది !" అని బాధ పడుతున్నారన్నారు. అవినీతి కేసు​ల నుంచి బయటపడడానికి జగన్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. జగన్​కు 25 ఎంపీలు ఇస్తే కేంద్రాన్ని కదిలిస్తా అన్నారు. కానీ ఇప్పుడు మోదీకి మసాజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details