తెలంగాణ

telangana

ETV Bharat / state

చలించి కదిలిన న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం - Justice_Kodandaram_Blood_Donation for talasamia victims

లాక్​డౌన్ వల్ల తలసీమియా బాధితులకు రక్తం కొరత ఉందని తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయనను చూసి స్ఫూర్తి పొందిన న్యాయమూర్తి డ్రైవర్ కుమార్తె, భద్రతకు వచ్చిన పోలీసు అధికారి రవీంద్రనాయక్​ కూడా రక్తదానం చేశారు.

justice-kodandaram-blood-donation-for-talasamia-victims
చలించి కదిలిన న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం

By

Published : Apr 14, 2020, 8:30 AM IST

తలసీమియా బాధితులకు తరచూ రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రక్తం కొరత ఏర్పడిందన్న వార్తను పత్రికల్లో చదివిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం చలించి తనవంతుగా రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. రక్తదానం చేయడానికి వెళుతుండగా డ్రైవర్‌ కుమార్తె కూడా ముందుకు వచ్చారు. శివరాంపల్లిలోని తలసీమియా అండ్‌ సికెల్‌ సెల్‌ సొసైటీకి వెళ్లి.. ఇద్దరూ రక్తదానం చేశారు.

చలించి కదిలిన న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం

భద్రతకు వచ్చిన పోలీసు అధికారి రవీంద్రనాయక్‌ వారిని చూసి రక్తదానం చేశారు. ప్రస్తుతం రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్న తలసీమియా బాధితులను ఆదుకోవడానికి న్యాయమూర్తి ముందుకు రావడంపై నిర్వాహకులు అలీంబేగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వారికి అభినందన పత్రాలు అందజేశారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details