తెలంగాణ

telangana

ETV Bharat / state

వీకర్​ సెక్షన్​ బస్తీల్లో భూములకు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్​ - జూబ్లీ హిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ తాజా సమాచారం

బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్​ అండగా నిలుస్తున్నారని జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ అన్నారు. సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. బోరబండలో భూముల థర్డ్​ పార్టీ రిజిస్ట్రేయన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

jubilee hills mla at lands third party registration in hyderabad
వీకర్​ సెక్షన్​ బస్తీలలో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్​

By

Published : Oct 5, 2020, 3:08 PM IST

బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్​ ఆధ్వర్యంలో బోరబండలో ఏర్పాటు చేసిన భూముల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్​.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత బలహీన వర్గాల వారికి చెందిన ఇళ్లను థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించడం ఒక్క కేసీఆర్​కే చెందుతుందని గోపీనాథ్​ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

బోరబండలోని వీకర్ సెక్షన్ బస్తీల్లో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కృషి చేసిన ఎమ్మెల్యేకి, కేసీఆర్​కి ఫసియుద్దీన్​ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని పథకాలను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు

ABOUT THE AUTHOR

...view details