ఆంధ్రప్రదేశ్ విశాఖలో విషవాయు వెలువడిన నేపథ్యంలో జీడీమెట్ల పారిశ్రామిక వాడ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. జీడీమెట్ల పరిసర ప్రాంతంలో నిత్యం విషవాయువులు, రసాయనాలతో వెదజల్లే వాసన విపరీతంగా పరిశ్రమలు వదులుతున్నాయని... స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఇవాళ జీడీమెట్ల పారిశ్రామికవాడలోని సుభాష్నగర్లో కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, పీసీబీ అధికారులు నాలాల వెంట పర్యటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని, కాలుష్యానికి కారకులైన పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ప్రాంతంలో 24 గంటలు ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.