ఏపీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై జేసీ గణేశ్కుమార్ వివరణ ఇచ్చారు. పర్యటనపై తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని అన్నారు.
'ఐసీఎంఆర్ పర్యటనపై తమకెటువంటి సమాచారం లేదు' - corona news
ఏపీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు జేసీ గణేశ్కుమార్. ఆనందయ్య మందు శాస్త్రీయతపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని ప్రస్తావించారు.

ఆనందయ్య కరోనా మందు
ఆనందయ్య మందుపై క్షేత్రస్థాయి సర్వే జరుగుతోందన్నారు గణేశ్కుమార్. ఇప్పటికే ఆయుష్ బృందం.. ఔషధ నమూనాలను సేకరించిందని ప్రస్తావించారు. మందు పని తీరు, ఇతర అంశాలపై దిల్లీలోనూ పరిశోధన జరుగుతున్నట్లు జేసీ వివరించారు.