రాష్ట్రంలో లావు రకాల ధాన్యాన్ని ఏ గ్రేడ్ కింద క్వింటాకు రూ.1,888, సన్నరకాలను సాధారణ రకం కింద 1,868 చొప్పున ప్రకటించారని కొన్ని జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వరి గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ.లు లేదా ఆపైన ఉంటే వాటికి ఏ గ్రేడ్ కింద మద్దతు ధర చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలన జరిపి రాష్ట్ర రైతులు సాగుచేసిన సన్నరకాలైన సాంబమసూరి(బీపీటీ 5204), తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్ 15048) వరి ధాన్యం ఏ గ్రేడ్ కిందకు వస్తాయని.. వాటికి క్వింటాకు రూ.1,888 చొప్పున చెల్లించాలని చెప్పినట్లు వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ ‘ఈనాడు ఈటీవీ భారత్’కు తెలిపారు.
ప్రస్తుత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 52.55 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా అందులో 70 శాతం వరకూ సన్నరకాల వరి వంగడాలనే రైతులు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 41.76 లక్షల ఎకరాలు కాగా అందులో 25 లక్షల ఎకరాల్లో సన్నరకాలు వేయించాలని వ్యవసాయశాఖ సీజన్కు ముందు లక్ష్యంగా పెట్టుకుంది. సీజన్ సాగు మరో 26 శాతం అదనంగా పెరిగి 52.55 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో సన్నరకాల సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాలు దాటింది.
అటు వర్షాలు.. ఇటు తెగుళ్లు