తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​కు రాకేశ్​ రెడ్డి...

జయరామ్​ హత్యకేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డిని పీటీ వారెంట్​పై హైదరాబాదు పోలీసులు తీసుకొస్తున్నారు. సాయంత్రంలోగా నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

By

Published : Feb 11, 2019, 6:16 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు నగరానికి తీసుకొస్తున్నారు. నందిగామ జైలునుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి సాయంత్రంలోగా నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

జనవరి 31న జరిగిన జయరామ్‌ హత్య కేసులో నిందితుడు రాకేశ్​రెడ్డిని నందిగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. హత్య హైదరాబాద్‌లో జరగడంతో కేసును జూబ్లీహిల్స్​కు బదిలీ చేశారు. తన భర్త హత్యపై హైదరాబాద్ పోలీసులే విచారణ జరపాలని పద్మశ్రీ కోరిన నేపథ్యంలో ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details