తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో జవాను భార్య ఆత్మహత్య - జవాన్​ భార్య ఆత్మహత్య

సికింద్రాబాద్​ తిరుమలగిరి ఆర్మీ క్వార్టర్స్​లో అనుమానాస్పద స్థితిలో జవాను భార్య ఆత్మహత్యకు పాల్పడింది. సంతానం కలుగకపోవటం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jawan wife commits suicide in suspicious condition In Secunderabad Thirumalagiri Army Quarters
అనుమానాస్పదస్థితిలో జవాను భార్య ఆత్మహత్య

By

Published : Jun 18, 2020, 5:27 AM IST

సికింద్రాబాద్​ తిరుమలగిరి ఆర్మీ క్వార్టర్స్​లో నివసించే నాగమురళీకృష్ణ, నాగలక్ష్మిలు భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు నాగలక్ష్మి ఇంట్లోని సీలింగ్​ ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుంది. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన భర్త ఆమెను స్థానికుల సహకారంతో మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. సంతానం కలుగకపోవటం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details