Pawan Kalyan : ప్రజలకు పాతిక కేజిల బియ్యం పంపిణీ చేయడానికి తాము రాజకీయాల్లోకి రాలేదని.. పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వడానికే జనసేన పార్టీ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ తెలిపారు. పేదలకు, యువతకు అండగా జనసేన ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రణస్థలంలో ఈనెల 12న నిర్వహించే జనసేన యువశక్తి సభకు యువత పెద్దఎత్తున తరలి రావాలని ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 'మన యువత.. మన భవిత' అంటూ పోస్ట్ చేశారు. రణస్థలంలో జరిగే సభలో ‘వాయిస్ ఆఫ్ యూత్’ వినేందుకు ఎదురుచూస్తున్నానంటూ పవన్ ట్వీట్లో తెలిపారు.
బియ్యం పంచడానికి కాదు.. పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వటానికే జనసేన: పవన్కల్యాణ్ - రణస్థలం జనసేన సభ
Pawan Kalyan : జనసేన పార్టీ ఏర్పాటుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 12వ తేదీన ఏపీలోని శ్రీకాకుళంలో ఉన్న రణస్థలంలో యువశక్తి పేరుతో జనసేన సభను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
![బియ్యం పంచడానికి కాదు.. పాతికేళ్ల భవిష్యత్ ఇవ్వటానికే జనసేన: పవన్కల్యాణ్ Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17398648-801-17398648-1672850449859.jpg)
Pawan Kalyan