తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 3:51 PM IST

ETV Bharat / state

కూకట్​పల్లి జోనల్ కార్యాలయం ఎదుట జనసేన ఆందోళన

కూకట్​పల్లి జోనల్​ కార్యాలయం ఎదుట జనసేన నేతలు నిరసన చేపట్టారు. నష్టపరిహారం అందని బాధితులకు వెంటనే 10వేల రూపాయలు అందించాలని డిమాండ్​ చేశారు.

janasena-leaders-protested-for  Compensation to flood victims in hyderabad
కూకట్​పల్లి జోనల్ కార్యాలయం ఎదుట జనసేన ఆందోళన

కూకట్​పల్లి నియోజకవర్గంలో నష్టపరిహారం అందని వరద బాధితులకు వెంటనే 10వేల రూపాయలు అందించాలని డిమాండ్​ చేస్తూ జనసేన పార్టీ నాయకులు జోనల్​ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రేటర్​ హైదరాబాద్​ జనసేన పార్టీ తరఫున కూకట్​పల్లి మున్సిపల్​ కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు.

తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెబుతామన్నారు.

ఇవీ చూడండి:'మజ్లిస్​ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్​ పాలన'

ABOUT THE AUTHOR

...view details