Pawan Kalyan Comments: ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన చెందుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డికి కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని ఆరోపించారు. ఆనం రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని.. ఆ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పేర్కొన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోని పరిస్థితిలో.. రాష్ట్రంలో పరిస్థితిని హోంశాఖకు లేఖ ద్వారా వివరిస్తానని స్పష్టం చేశారు.
'ఆనం రాంనారాయణరెడ్డికి ప్రాణ హాని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితి' - పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు
Pawan Kalyan Comments: ఏపీలోని ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాణహాని ఉందని ఆనం ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాణహానితో భయపడే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని పవన్ అన్నారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కులేదని పేర్కొన్నారు. ఆనం ప్రాణహాని వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు ఏం వివరణ ఇస్తుందని ప్రశ్నించారు. సీఎంపై కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ, హోంమంత్రి ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: