Jana Sena leader Naga Babu:పూర్తి పరిజ్ఞానం లేని కొందరు మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందుతాయన్న భ్రమలో వైకాపా నేతలున్నారని.. జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించి పవన్తో మాట్లాడారని, పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని నాగబాబు స్పష్టంచేశారు.
అందరి లెక్కలు బయటకు తీస్తాం.. వారికి నాగబాబు వార్నింగ్ - ఏపీ తాజా రాజకీయ వార్తలు
Jana Sena leader Naga Babu పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించి పవన్తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు.
![అందరి లెక్కలు బయటకు తీస్తాం.. వారికి నాగబాబు వార్నింగ్ NGABABU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16932887-103-16932887-1668495195685.jpg)
NGABABU
పరిపాలన గాలికొదిలేసిన మంత్రులు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్నది మాత్రం ..వాళ్లకు ఎందుకని ఆయన నిలదీశారు. ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో చెప్పాలని వైకాపా మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో ఉన్నట్టు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే... అన్ని లెక్కలూ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు.
ఇవీ చదవండి: