ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో జై అమరావతి నినాదాలు మారు మోగాయి. వేడుక ఏదైనా సరే.... అమరావతి వాసుల నినాదం ఒక్కటే.. అదే జై అమరావతి... అందరిలో ఉత్సాహాన్ని నింపారు అక్కడి మహిళలు, రైతులు.
జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు - ap news
వేడుక ఏదైనా... అమరావతి వాసుల నినాదం ఒక్కటే అదే 'జై అమరావతి'. ఏపీలోని తుళ్లూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. అందరిలో ఉద్యమహోరు కనిపించింది. ఫ్లకార్డులు చేతపట్టి రైతులు, మహిళలతో పాటు వధూవరులు సైతం 'జై అమరావతి' అంటూ నినదించారు.
![జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10185363-590-10185363-1610242577836.jpg)
జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు
జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు
వారి నినాదాలకు వధూవరులు సైతం గొంతు కలిపారు. అమరావతి ఉద్యమానికి అక్కడున్నవారంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి:పులుల సంచారంపై ఎంపీ సోయం సంచలన వ్యాఖ్యలు