తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు పట్టించాడని వెంటాడి మరీ చంపేశాడు... - murder news

ఓ మహిళ పరిచయం... ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. మహిళను కలిసేందుకు వెళ్లే క్రమంలో పరిచయమైన వ్యక్తుల చేతిలోనే మరణించాల్సివచ్చింది. చిన్నచిన్న ఘర్షణలే పగలుగా మారి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లాయి.

jagdgirigutta murder case reveled by police
పోలీసులకు పట్టించాడని వెంటాడి మరీ చంపేశాడు...

By

Published : May 15, 2020, 3:49 PM IST

హైదరాబాద్ జగద్గిరిగుట్ట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 11న ఆర్పీకాలనీలో వెంటాడి ఓ వ్యక్తిని హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బంజారాహిల్స్​కు చెందిన ఫయాజ్ ఖాన్... డ్రైవర్​గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్ట ఆర్పీ కాలనీకి చెందిన మహిళతో ఫయాజ్​ఖాన్​కు పరిచయం ఏర్పడింది. మహిళను కలిసేందుకు ఫయాజ్​ తరుచూ జగద్గిరిగుట్టకు వచ్చేవాడు.

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, సాయి, నరేశ్​, శివ అనే నలుగురితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య తరుచూ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతుండేవి. ప్రశాంత్ రెడ్డిపై 2018లో రాయదుర్గం ఠాణా​లో ఓ కేసు నమోదు అవగా... పోలీసులకు తప్పించుకుని తిరుగుతుండేవాడు. ఈ విషయం తెలిసి.. 2019లో ప్రశాంత్​రెడ్డిని ఫయాజ్ పోలీసులకు పట్టించాడు.

తనను పట్టించాడన్న కోపంతో లాక్​డౌన్​కు ముందు విడుదలైన ప్రశాంత్​రెడ్డి.... ముగ్గురు స్నేహితులతో కలిసి 11న ఫయాజ్​ఖాన్​ను కత్తులు, బండరాయితో హత్యచేశారు. కేసును చేధించిన పోలీసులు... నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల దగ్గరి నుంచి మూడు చరవాణులు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ABOUT THE AUTHOR

...view details