Jagadish Reddy VS Komatireddy Brothers In Assembly :రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలతో సభా ప్రాంగణమంతా వేడి వాతావరణం ఏర్పడింది. అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి విడుదల చేసిన శ్వేతపత్రంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, కోమటి బ్రదర్స్ మధ్య వాడివేడి సంభాషణలు జరిగాయి. ఒకరిపై ఒకరు తమదైన శైలీలో చర్చలు జరిపారు. అధికారంలో ఉండి అనేక కుంభకోణాలు చేశారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డిపై తీవ్ర ఆరోపణాలు చేశారు. అధికారం కోసం పార్టీలు మారే వాళ్లు తన కోసం మాట్లాడటం సరికాదని జగదీశ్ సమాధానమిచ్చారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్సెస్ జగదీశ్రెడ్డి - విద్యుత్ రంగంపై వాడివే‘ఢీ’గా చర్చ
అధికారంలో పర్మినెంట్గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్తో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మాత్రం మారడం లేదని మండిపడ్డారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్ని విమర్శిస్తున్న వాళ్ల పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. రూ.4లకే దొరికే పవర్ను రూ.6లకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శించారు.
Komati Brothers Fires on Jagadish Reddy : రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు. కిరోసిన్ దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి రూ.1000 కోట్ల విలువైన బంగ్లాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తాను పార్టీలు మారింది ప్రజల కోసమేనని, పదవులు, పైసల కోసం కాదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులకు మాట్లాడే ధైర్యముందా అంటూ ప్రశ్నించారు.